మధుర శ్రీకృష్ణజన్మభూమి పోరాటం వెనక వాస్తవాలు

ముఖపుస్తకం లో మిత్రులు Chadalavada Bharadwaj గారుమధుర పైన వ్రాసిన సమగ్రమైన వ్యాసం

బుద్ధుడు పుట్టటానికి 2500 సంవత్సరాలకు ముందు నుండే అపురూపమైన ఆధ్యాత్మిక శోభ తో అలరారుతూ..సనాతన జ్ఞాన దీపమై వెలుగులీనుతూవుండేది మధుర

కాశీ అయోధ్య తదితర హిందూ క్షేత్రాలలానే మధుర శ్రీకృష్ణ జన్మభూమి పై పలుసార్లు విధ్వంసక దాడులు జరిగాయి. భక్త జనులు ధన మాన ప్రాణాలను ఎదురొడ్డి తురుష్కుల చేసిన దాడులను తిప్పికొట్టారు.

శ్రీకృష్ణ జన్మ భూమి ప్రాంతంలో మొట్టమొదటగా శ్రీ కృష్ణ ని మనవుడు అనిరుధ్దుని కొడుకు వజ్రనాభుడు ఆలయ సముదాయం నిర్మించినట్లు క్షేత్ర పురాణం తెలియ చేస్తోంది.శ్రీకృష్ణ జన్మస్థానంగా చెబుతోన్న కత్రా కేశవ్‌ దేవ్ ఆలయాన్ని శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం చుట్టూ నిర్మించినట్లు క చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులను అక్కడ కంసుడు బందీలుగా ఉంచాడు

ఈ స్థలంలో భారత పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల లో క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్ది కి ముందే శ్రీకృష్ణ ఆలయం వున్నట్లు పలు సాక్ష్యాలు లభ్యమైనాయి

ఈ తవ్వకాలలో లభ్యమైన వస్తువులు మధుర ప్రభుత్వపురావస్తుప్రదర్శనశాలలో నేటికీ భద్రంగా ఉన్నాయి.

తవ్వకాల లో లభించిన పలువస్తువులు క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం కంటే ముందునుండి ఆలయం వుందిఅని అనటానికి అవసరమైన ఆలయ సామాగ్రి

కుండలు టేరాకోట్ ప్రక్రియల్లో తయ్యారు చెయ్యబడ్డ వస్తువులు లభ్యమైనాయి.

అంతేకాకుండా లభించిన మరికొన్ని శాసనాలు క్రీస్తుశకం 8 వ శతాబ్దం లో రాష్ట్రకూటులు ఈ ఆలయానికి భారీగా భూ విరాళాలు ఇచ్చినట్లు ధాన శాసనాలు లభ్యమైనాయి.

లభించిన పురాతన చారిత్రక ఆధారాలను పట్టి ఈ ఆలయాన్ని పలుసార్లు జీర్ణోద్ధరణ చేసినట్టు పురాతత్వ వేత్తలు,చరిత్రకారులు అభిప్రాయం.

క్రీస్తుపూర్వం 3 శతాబ్ధం చివరలో మొట్టమొదట గా మత కోణంతో ఈ ఆలయం పై దాడులు చేసింది భౌద్ధ చక్రవర్తి ఆనందుడు ఇతను భౌద్ధమతాభిమానంతో ఈ ఆలయాన్ని భౌద్ధ అరామంగా మార్చాడు

తరవాత క్రీస్తు పూర్వం 4 శతాబ్దం చివరిలో గుప్తుల కాలంలో

భౌద్దారామాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి శ్రీకృష్ణ ఆలయంగా మార్పు చేశారు.తిరిగి 7వ శాతాబ్ధ ము చివరలో వైష్ట్నవ ఆలయ మును తిరిగి జైనారామంగా మార్చారు. తిరిగి 9 వ శతాబ్ద చివర కాలంలో తిరిగి శ్రీకృష్ణ ఆలయంగా మార్చారు. కాబట్టే ఈ ప్రదేశం లో జరిగిన తవ్వకాలలో హిందూ మత చిహ్నాల తోపాటు భౌద్ధ జైన మత చిహ్నాలు లభించాయి అని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం.

మధ్య యుగంలో క్రీస్తుశకం 1017-1018 లో మహ్మద్ గజనీ బృందావనం మరియు మధుర పై దాడి చేసి చరిత్రలో కనీ వినీ ఎరగని రక్తపాతం సృష్టించి విలువైన అనంత సంపదను దోచుకున్నాడు.

మధుర పై గజనీ చేసిన దాడిని గజనీ ఆస్థాన రచయిత, అల్ ఉత్బీ తన తారిఖ్-ఇ-యామిని అనే అరబిక్ లో వ్రాసిన చారిత్రక గ్రంథంలో వర్ణించాడు.తారిఖ్-ఇ-యామిని అరబిక్ నుండి

ఇంగ్లీష్ అనువదించబడిన పత్రి నేటికీ లభ్యం అవుతున్నది

-తారిఖ్-ఇ-యామిని అంటే అరబిక్ భాషలో అలంకరించబడిన, పుష్పించే పుష్పం అని అర్థం అలంకారిక ప్రాస గద్యంలో వ్రాసిన తారిఖ్ ఐ యామిని, లేదా కితాబ్ ఐ యామిని, సెబుక్టిగిన్ మరియు మహముద్ పాలనల చరిత్ర.

గజనీ ఆస్థాన చరిత్రకారుడు అబూ నస్ర్ ముహమ్మద్ ఇబ్న్ ముహమ్మద్ అల్ జబ్బారు-ఎల్ ఉట్బి రాశారు. అతని రచనలో సెబుక్టిగిన్ పాలన మొత్తం, మరియు మహముద్ యొక్క భాగం, 410 హిజ్రా సంవత్సరం వరకు ఉన్నాయి.

అతని రాత లలో నే”నగరం మధ్యలో ఒక భారీ మరియు అద్భుతమైన శిల్ప కళ తో అలరారే ప్రాచీన ఆలయం ఆకాశాన్ని తా కుతున్నట్లు ఉంది, ఇది మానవులు కాదు, దేవతలు నిర్మించారని ప్రజల విశ్వాసం … ఆలయానికి సంబంధించిన ఏదైనా అంశాన్ని వర్ణించటానికి భాషా పటిమ సరిపోదు.

చెయ్యి తిరిగిన చిత్రలేఖకుడు మాత్రమే ఆలయ సౌందర్యాన్ని తన ప్రతిభతో చిత్రాలు గా ఆవిష్కరించ గలడు . ఈ ఆలయ అందాన్ని వర్ణన చెయ్యటానికి, పదాలు సరిపోవు చిత్రాలలో,మాత్రమే చెప్పగలము చిత్ర లేఖనం కూడా. చిన్నబోయింది ఆలయ అందాన్ని తెలియజేయడంలో విఫలమైంది.” ఘజనీకి చెందిన మహమూద్ ఇంకా ఇలా వ్రాశాడు, “ఎవరైనా ఈ ఆలయానికి సమానమైన అందమైన భవనాన్ని నిర్మించాలనుకుంటే, కనీసం వంద మిలియన్ దినార్లు ఖర్చు చేయకుండా చేయలేరు, ఇంకా అనేక రకాల సామర్థ్యాలు కల వ్యక్తుల తో పాటు అనుభవజ్ఞులైన కార్మికులు కలగలిసి రాత్రి పగలు పనిచేస్తే దాదాపు, రెండు వందల సంవత్సరాలుసమయం పట్టవచ్చు అని అంచనా వేశారు

ఇంతటి సుందర ఆలయ సముదాయాన్ని కూల్చివేసి కాల్చివేసి ఆలయ సంపద ను దోచుకుని రమ్మని మహ్మద్ గజనీ తన సైనికులకు ఆదేశించాడు. వారు ఆలయ ప్రాంగణంలోని బంగారు మరియు వెండి విగ్రహాలను దోచుకున్నారు

ఈ ఆలయంలో దోచుకున్న సంపదను దాదాపు వెయ్యి ఒంటెల పై తన దేశానికి మోసుకెళ్ళాడు.

గజనీ

ఈ ప్రదేశం లో జరిగిన తవ్వకాలలో కనుగొనబడిన సంస్కృతంలో ఉన్న ఒక రాతి శాసనం ప్రకారం

విక్రమ సంవత్ ఇతను మొట్టమొదటి భారతీయ క్యాలండర్ రూపకర్త 1150-1207 కాలంలో గహడవల రాజు అయిన విక్రమ్ సంపత్ ఆదేశానుసారం అతని సామంతుడిగా ఉండే జజ్జ అనే రాజు’తెల్లని మరియు మేఘాలను తాకుతున్న’ విష్ణు ఆలయాన్ని తిరిగి నిర్మించాడు అని తెలుస్తున్నది

ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి చాలా పెద్ద సైన్యంతో మధుర పై దాడి చేసి హిందువులను ఊచకోత కోసి ఆలయాన్ని విధ్వంసం చేశారు ఆలయ సంపదను తిరిగి దోచుకున్నారు. అంతేకాకుండా యమునా నది లో హిందువులు ఎవరు స్నానం చేయరాదు అని ఆదేశించాడు.ఇంకా నదీతీరంలో హిందువులు క్షౌర ము చేయించుకొనరాదని కూడా ఆజ్ఞలు జారీచేయబద్దాయి అని తారిఖ్-ఇ-దౌదీ అనబడే పారశీక గ్రంధంలో పేర్కొన్నారు

తిరిగి మొఘల్ చక్రవర్తి జహంగీర్ సైన్యాధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా సికిందర్ లోడి దాడులతో నామ మాత్రంగా మిగిలిన ఈ ఆలయ సముదాయం పై తిరిగిదాడి చేశారు కనీ వినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించారు.

అయితే జంహంగీర్ చక్రవర్తి కాలంలో నే 1618 లో ఓర్చాకు చెందిన వీరసింగ్ దేవ్ బుందేలా దాదాపు ముప్పై లక్షల రూపాయల వ్యయం తో ఆలయంలో కొంత భాగాన్ని పుననిర్మించారు. ఆ రోజులలో

మొఘల్ యువరాజు దారాషికో ఈ ఆలయానికి భారీ మొత్తంలో భూరి విరాళం తోపాటు ధన వస్తు రూపంలో సహాయం చేశారు

చిట్టచివరి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశానుసారం మథుర గవర్నర్ అబ్దున్ నబీ ఖాన్ ఆలయాన్ని సమూలంగా కూల్చివేసి ఎదురు తిరిగిన హిందువులను తెగనరికి దేవాలయ శిథిలాలపై జామా మసీదును నిర్మించాడు. మథురలో జాట్ తిరుగుబాటు సమయంలో, అబ్దుల్ నబీ ఖాన్ 1669 లో చంపబడ్డాడు. జాట్ నాయకులు తిరిగి కేశవ దేవ్ ఆలయాన్ని తిరిగి నిర్మించగా ఈ సారి ఔరంగజేబు స్వయంగా మధురపై దాడి చేసి 1670లో ఆ కేశవదేవ ఆలయాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో షాహీ ఈద్గాను నిర్మించాడు

ఫ్రెంచ్ యాత్రికుడు. జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ అను రత్నాల వ్యాపారి

1650 నుండి 1675 వరకు దాదాపు ఆరు సార్లు భారత దేశాన్ని సందర్శించాడు ఆ సమయంలోనే మధురను దర్శించాడు ఎర్ర ఇసుక రాతితో నిర్మించిన కేశవ దేవ్ అష్టభుజి ఆలయా విశిష్ఠతను తన ట్రావెలాగ్ లోఎంతో అద్భుతంగా వర్ణించారు అంతే కాకుండా ఔ రంగజెబ్ దాడి కి సంబంధించిన వివరాలను భీతావహంగా వివరించాడు మొఘల్ ఆస్థానంలో పనిచేసినఇటాలియన్ యాత్రికుడు నికోలావ్ మనుచి 19 ఏప్రిల్ 1638–1717 ఒక వెనీషియన్ రచయిత, స్వీయ-బోధన వైద్యుడు మరియు యాత్రికుడు, అతను మొఘల్ సామ్రాజ్యం యొక్క చరిత్రను ప్రత్యక్షంగా చూసి నాటి స్థితి గతులను పుస్తక రూపంలోవ్రాసాడు, అంతేకాక మొఘల్ ఆస్థాన యునాని వైధ్యుడి గా పని చేశారు ఇయన తనరాసిన స్టోరియా డో మోగోర్ లో నాటి కేశవ దేవ్ ఆలయ వైభవాన్ని దాడికి గురైన నేపథ్యాన్ని సవివరంగా గ్రంధస్థం చేశారు

మధుర కు మల్లాపురం అనే పేరు కూడా ఉంది. మధుర లో కృష్ణ జన్మస్థాన్ గా పిలువబడే ప్రస్తుత స్థలాన్ని కత్రా లిట్. ‘మార్కెట్ ప్లేస్’ కేశవదేవ అని రకరకాల పేర్లతో భక్తజనం పిలుస్తారు.

1804లో మథుర బ్రిటీష్ నియంత్రణలోకి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కత్రా భూమిని అంటే ఆలయానికి చెందిన భూమినివేలం వేసింది. ఈ వేలంపాటలో మధుర కృష్ట జన్మ భూమి స్థలాన్ని కాశీలోని ఒక సంపన్న బ్యాంకర్ శ్రీ రాజా పత్నిమల్ కొనుగోలు చేసారు

శ్రీరాజా పత్నిమల్ తను బ్రిటీష్ ప్రభుత్వం నుండి కొనుగోలు చేసిన స్థలంలో ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు కానీ అలా చేయలేకపోయాడు. అతని వారసులు శ్రీరాయ్ కృష్ణ దాస్ కత్రా భూమిని అనగా శ్రీకృష్ణ జన్మభూమి గా పిలవబడుతున్న స్థలాన్ని వారసత్వంగా పొందారు.

మథుర ముస్లింలు 1935 లో వేసిన రెండు సివిల్ వ్యాజ్యాలలో, ఆలయ భూమి మరియు షాహీ ఈద్గా ఉన్న 13.37 ఎకరాల భూమి యాజమాన్యం కోసం అతని వారసుడు రాయ్ కృష్ణ దాస్ ను సవాలు చేస్తూ మొట్టమొదటి సారి న్యాయ స్థానం మెట్లు ఎక్కారు అయితే అలహాబాద్ హైకోర్టు రెండింటిలోనూ శ్రీ రాజ్ కృష్ణ దాస్‌కు అనుకూలంగా తీర్పులను వెలువరించింది

1935లో దాఖలు చేయబడ్డ ఈదావాల లో శ్రీ రాయి కృష్ణ దాస్ కు శ్రీ. కైలాష్ నాథ్ కట్జూ అతను ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ గవర్నరు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రి, కేంద్ర రక్షణ మంత్రి గా పలుపదువులు నిర్వహించాడు.ఇతను భారతదేశ ప్రముఖ న్యాయవాదులలో ఒకడు. ఇతనుతో కలిసి మరియు శ్రీమదన్మోహన్ చతుర్వేది కూడా ఈ వివాదంలో శ్రీ రాయ్ కృష్ట్న దాస్ కు సహాయం చేసారు.

1944 లో ప్రముఖ హిందూ నాయకుడు మరియు విద్యావేత్త శ్రీ మదన్ మోహన్ మాలవీయ శ్రీ రాజ్ కృష్ణ దాస్ నుండి 7 ఫిబ్రవరి న పారిశ్రామికవేత్త జుగల్ కిషోర్ బిర్లా ఆర్థిక సహాయంతో 13000 రూపాయిలను శ్రీకృష్ణ జన్మభూమి స్థలాన్ని కొనుగోలు చేశారు. పండిట్ శ్రీ మదన్ మోహన్ మాలవ్య మరణం తరువాత, జుగల్ కిషోర్ బిర్లా శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్‌ను స్థాపించారు,

ఫిబ్రవరి 21 1951న శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్‌గా నమోదు చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. జుగల్ కిషోర్ బిర్లా

నూతన ఆలయ నిర్మాణ బాధ్యతలను మరొక పారిశ్రామికవేత్త మరియు పరోపకారి శ్రీ జైదయాల్ దాల్మియాకు అప్పగించారు..

ఆలయ సముదాయం నిర్మాణం అక్టోబర్ 1953లో భూములను చదును చేయడంతో ప్రారంభించబడింది

మరియు ఫిబ్రవరి 1982లో అంటే దాదాపు ముప్పై సంవత్సరాలకు పూర్తయింది.

శ్రీ జై దయాళ్ దాల్మియా తరవాత పెద్ద కుమారుడు శ్రీ విష్ణు హరి దాల్మియా ట్రస్ట్ కార్యక్రమాలకు నాయకత్వం వహించారు మరణం వరకు ట్రస్ట్‌లో పనిచేశాడు. శ్రీ విష్ణు హరి దాల్మియా మరణానంతరము అతని కుమారుడు శ్రీ జై దయాళ్ దాల్మియా మనవడు అనురాగ్ దాల్మియా ట్రస్ట్‌లో జాయింట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. నూతన ఆలయ నిర్మాణానికి రామ్‌నాథ్ గోయెంకాతో సహా ఇతర వ్యాపార కుటుంబాలు నిధులు సమకూర్చాయి .

1968లో, శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ మరియు షాహీ ఈద్గా కమిటీ స్థల విషయంలో పరస్పరం ఒక రాజీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి,

ఈ ఒప్పడం ప్రకారం ఆలయ భూమిని ట్రస్ట్‌కు మరియు షాహీ ఈద్గా నిర్వహణను ఈద్గా కమిటీకి బదలాయింపు జరిగింది. అలాగే శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ మునుముందుఎటువంటి చట్టపరమైన దావాలనుషాహీ ఈద్గా.పైవేయబోదు.

భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు గణేష్ వాసుదేవ్ మావలంకర్ రాజీ ఒప్పందంపై సంతకం చేసిన శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్‌కు మొదటి ఛైర్మన్

అయితే చైర్మన్ హోదాలో ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి అతని చట్టపరమైన అధికారం లేదు అన్నది నేటి సంఘ్ పరివార్ విశ్వ హిందూ పరిషత్ నాయకుల వాదన. ఈ ఒప్పందం తో హిందువులకు అన్యాయం జరిగిందని మెజార్టీ హిందూప్రజల అభిప్రాయం

గణేష్ వాసుదేవ్ మావలంకర్ తరువాత MA అయ్యంగార్ , తరువాత అఖండానంద సరస్వతి మరియు రామ్‌దేవ్ మహారాజ్ వచ్చారు. నృత్యగోపాలదాస్ ప్రస్తుత చైర్మన్.

1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత తో, బృందావన్ నివాసి మనోహర్ లాల్ శర్మ, 1968 ఒప్పందాన్ని సవాలు చేస్తూ మధుర జిల్లా కోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు.అలాగే యథాతథ స్థితిని కాపాడే 1991 నాటి మత ప్రార్థనా స్థలాల చట్టాన్ని రద్దు చేయాలనే పిటిషన్‌ను కూడా జత చేసి దాఖలు చేశారు.

శ్రీకృష్ణుడి ఆలయ ప్రాంతానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని కోరుతూ మథుర కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై విచారణకు మథుర కోర్టు అంగీకరించింది. మనీష్‌ యాదవ్‌, మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌, దినేశ్‌ శర్మ అనే ముగ్గురు వ్యక్తులు ఈ పిటిషన్ వేశారు. షాహీ ఈద్గా ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహించేందుకు అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించాలని వారు కోరారు. మొత్తం 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కృష్ణుడి ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారని పిటిషనర్లు ఆరోపించారు. 17వ శతాబ్దం నాటి ఈ మసీదును తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

మథుర సివిల్ కోర్టులో ఈ వివాదంపై 2020 సెప్టెంబర్‌లో తొలి పిటిషన్ దాఖలైంది. లఖ్‌నవూ వాసి రంజనా అగ్నిహోత్రి సహా మరో ఆరుగురు వ్యక్తులు శ్రీకృష్ణు భగవానుడి తరఫున ఈ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ మసీదును తొలగించి ఆ ప్రాంతాన్ని కృష్ణ జన్మభూమి ట్రస్టుకు తిరిగి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.

అయితే 2020 సెప్టెంబర్ 30న ఈ పిటిషన్‌ విచారణ యోగ్యం కాదని సివిల్ కోర్టు జడ్జి తిరస్కరించారు. పిటిషనర్లు ఏ ఒక్కరూ మథురకు చెందినవారు కాదని పేర్కొన్నారు. దీంతో పిటిషనర్లు తమ వ్యాజ్యాన్ని పునఃపరిశీలించాలని మథుర జిల్లా కోర్టును ఆశ్రయించారు. 2022 మే 19న ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది కోర్టు. ట్రస్ట్‌ను, ఆలయ అథారిటీలను ఈ దావాలో పార్టీలుగా చేర్చింది.

మధుర ఆలయం వెనుక సుదీర్ఘ రక్త చరిత్ర ఉంది

కొన్నిలక్షల మంది మన పూర్వుల ఆత్మ బలిదానం ఉంది మధుర ను విముక్తి చెయ్యటం మన అందరి కర్తవ్యం

2020 నుంచి ఇప్పటి వరకు మథుర కోర్టులో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కనీసం డజనుకుపైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకరు ఈ స్థలంలో తవ్వకాలు జరపాలని కోరగా, మరొకరు పురావస్తు శాఖతో శాస్త్రీయ పద్ధతుల లోసర్వే జరిపించాలని డిమాండ్ చేశారు. మసీదులో ఉండే ఆలయ అవశేషాల రక్షణ కోసం అక్కడ సీసీటీవీలు ఏర్పాటు చేయాలని మరొక పిటిషనర్‌ కోరారు. ప్రస్తుతం డిస్తిక్ కోర్టు హైకోర్టులో హిందువులకు అనుకూలమైన తీర్పులు రాగా షాహీ ఈద్గా దర్గా లో అధునాతన శాస్త్రీయ పద్దతులలో సర్వే జరపాలని హిందువులు దాఖలు చేసిన పిటిషన్ కు అనుకూలంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కూడా తాజాగా కిందటి డిసెంబర్ లో సమర్థించింది

ముఖ్యంగా వివాదాస్పదమైన13;37 ఎకరాల పై యాజమాన్య హక్కులు ఎవరికి చెందుతాయి అన్న విషయం పై సుప్రీం కోర్టు లో విచారణ జరుగుతోంది

అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఆలయానికి 1991 ప్రార్థనా స్థలాల చట్టం వర్తించదు ఎందుకంటే న్యాయ వివాదం 1935 లోనే ప్రారంభమైంది కాబట్టి..

త్వరలో ఈ ఆలయ అంశంలో కుడా మనం తీయ్యని కబురు వింటాం

రామ ప్రతిష్ఠ జరిగింది

విశ్వేశ్వరుడు విముక్తి ప్రయత్నాలు విజయవంతంగా సాగుతున్నాయి

కృష్ణయ్య ను కూడా దర్గా పేరు తో ఆక్రమించిన13.37 ఎకరాలను కలుపుకుని భవ్య కృష్ణా ఆలయం త్వరలో నిర్మించాలని కోరుకుందాం

జై శ్రీరామ్ జై విశ్వనాథ జై శ్రీకృష్ణ

13 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు – నా ప్రయాణం కబుర్లు

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం & వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి సంయుక్త ఆధ్వర్యంలో 13 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కాలిఫోర్నియాలో మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారి భవనంలో గత వారాంతం అక్టోబర్ 21-22 2023 న జరిగింది.

వక్తలని ఆహ్వానిస్తూ వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి విద్యుల్లేఖ రాగానే నా ప్రసంగం కూడా పంపించాను. చాలా రోజులు జవాబు రాకపోయేసరికి ‘నాబోటి దాని మాటలు ఎలా ఎంపిక చేస్తార్లే మరీ అత్యాశ’ అనుకుని మర్చిపోయాను. ఉన్నట్టుండి రాజు గారు నుంచీ వక్తలని ఉద్యేశిస్తూ మళ్ళీ లేఖ . ‘నా ప్రసంగం ఎంపిక అయ్యిందా ‘ అని అడిగాను వారిని. ‘అందుకేగా పంపాము ‘ అని జవాబు వ్రాసారు ఆయన . మొత్తం ప్రసంగం తిరిగి వ్రాసి పంపాను. కానీ ఈ గందరగోళంలో నేను పంపిన draft copy ప్రచురణ అయ్యింది అని, ‘సభా విశేష సంచిక’ చూసాక అర్ధమయ్యింది.

చిట్టెంరాజు గారు, నేను ‘పదసాహిత్యం ‘ తరగతిలో సహాధ్యాయులం. తరగతికి రాగానే అయన అందర్నీ పేరుపేరునా భలే చక్కగా పలకరిస్తారు. ఇక నన్ను చూసినప్పుడల్లా ‘టికెట్ బుక్ చేసావా’ అంటూ పలకరించడం మొదలు పెట్టారు. అలా టికెట్ కొనుక్కుని ప్రయాణానికి సిద్ధమయ్యాను.

2017లో వంగూరి వారి తెలుగు సదస్సు మా ఊర్లోనే జరిగింది. ఎంతో మంది రచయితలు వచ్చారు. ఈమాట లో, కౌముదిలో రచనలు చేసే రచయితలే నాకు పెద్ద సెలెబ్రిటీలు. వారు వ్రాసిన కథలు గురించి వారితో పంచుకునే అవకాశం వచ్చింది. అలా ఆనాడు ఎందరో సాహితీ ప్రముఖులని కలిసాను . మొట్టమొదటి సారి like minded group తో కలిస్తే ఆ వచ్చే ఆనందం ఏంటో అర్ధమయ్యింది. అందుకే ఆ ఆనందం ఏ మాత్రం వదులుకోకూడదు అని నిర్ణయించేసుకున్నాను.

మరి ఈసారి 2023లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అంటే నేను చదివే విశ్వవిద్యాలయం, మా ఆచార్యుల వారు మృణాళిని గారిని & ఇతర సహాధ్యాయులని కూడా కలవడం అవుతుందని చాలా ఆనందం వేసింది. అనుకున్నట్లే మా సీనియర్లు అయిన కిరణ్ సింహాద్రి, భాస్కర్, వేణుగోపాల్ గార్లను, నాతో పాటూ చదువుతున్న గిరిధర్ గారిని కలిసాను. ఇక చిట్టెంరాజు గారి సంగతి వేరే చెప్పలేదనుకుంటాను.

20 తేదీ మధ్యాహ్నం కల్లా అక్కడికి వెళ్ళాను. Airport నుండీ BART అనే మెట్రో రైలు ప్రయాణం చేద్దాం అని ముందరరోజు నిర్ణయించేసుకున్నాను. అమెరికాలో ఎప్పుడూ కారులో ప్రయాణిస్తాం. అవకాశం ఉన్నపుడు ఎలా ఉంటుందో చూడచ్చు కదా అనిపించింది. పగటిపూట కూడా అయ్యింది. భయం ఏమి ఉండదు అని స్నేహితురాలు కూడా భరోసా ఇచ్చేసింది. DC మెట్రో తో పోలిస్తే నాకు పెద్దగా నచ్చలేదు. ఇంకా చెప్పాలంటే మన భాగ్యనగరం & ఢిల్లీ మెట్రో నే బావుందేమో అనిపించింది కూడా.

పనిలో పని దానధర్మ సంస్థ వెంకట్ ఊటుకూరి గారిని కలవాలి అనుకున్నాను. వెళ్ళిన రోజు సాయంత్రమే కలిసాను. వారు ఓ గంటన్నర ప్రయాణం చేసి వచ్చారు. వారిని కలవడం చాలా సంతోషం అనిపించింది.

ఇక సిలికానాంధ్ర కుటుంబం చేసిన మర్యాదలు అంతా ఇంతా కాదు. సభా ప్రాంగణం అంతా తెలుగు మయం. చిత్రాలు చూసి ఉంటే అర్ధమవుతుంది. వచ్చిన వారు 10 lbs బరువు పెరిగేలా చేసి పంపడమే వారి ధ్యేయం అన్నట్టు చెప్పారు రాజు చమర్తి గారు. ఉన్న రెండు రోజులు ‘కాఫీలు తాగారా .టిఫినీ తిన్నారా’ అని అడుగుతున్నట్లే అనిపించింది. వీరందరినీ మేము ‘మనబడి’ సదస్సుల్లో కలుస్తూనే ఉంటాము. వారి నిజస్వరూపం ఈ రెండురోజుల్లో తెల్సింది 😂(సరదాగా) . ‘మనబడి’ లాంటి పెద్ద సంస్థ నడపడానికి వెనుక ఎంత మంది కృషి ఉంటుంది అనేది స్పష్టంగా అర్ధమయ్యింది. ‘కాన్ఫరెన్స్’ అని అనిపించేలా బల్లలు, పెన్నులు , notepad లు పెట్టారు. పూలగుత్తుల అలంకరణ చిత్రాలలో చూసారుగా. మధ్యలో నోట్లోకి అలా ఏదో చప్పరించేలా జీడిపప్పులు, M & M లు ఉంచారు. మధ్యాహ్నం భోజనాలు అయిన కాసేపటికి కొబ్బరి నీళ్ళు ఇచ్చారు. ‘ మీరంతా సరస్వతీ స్వరూపులు’ అంటూ ఆనంద్ గారు అన్నీ చేతికి తెచ్చివ్వటం ఆశ్చర్యం వేసింది. కాసేపటికి వేడి వేడి మిరపకాయ బజ్జీలు, పునుగులు పెట్టారు. సాయంత్రం అరిటాకులు వేసి వడ్డనలు. అప్పుడు నేను ‘సదస్సు కి వచ్చిన అతిథి’ అనే వేషం పక్కన పెట్టి, ‘సిలికానాంధ్ర వాలంటీర్ , విద్యార్థిగా వేషం’ వేసి , హడావిడిగా వడ్డన చేస్తూ పని చేసినట్లు నటించాను. ఫొటోల్లో కూడా పడేటట్లు చూసుకున్నాను. భోజనాల తరువాత వల్లీ గారి కవితా కిళ్లీ ఇచ్చారు. ఆ కిళ్ళీ తింటే అలా ఆశువుగా కవిత్వం చెప్పేస్తారట 😂 వల్లీ గారే చెప్పారు.

వక్తల ప్రసంగాలు చాలా మటుకు బావున్నాయి అక్కడక్కడా తప్ప. భాస్కర్ రాయవరం లాంటి వారి ప్రసంగాలు నాలాంటి విద్యార్థులకి ఉపయోగపడేలా ఉన్నాయి. వారూ నా సహాధ్యాయి. సాహిత్య అనుభవం కలిగినవారు కూడా కావడంతో ఆ ప్రసంగం చాలా బావుంది. వారు వారి ఛానల్ లో కథాకేళి అనే కార్యక్రమం నిర్వహిస్తారు . దాన్ని ఆధారంగా చేసుకుని వివిధ దేశాల్లో ఆ కథ చెప్పే క్రమం ఎలా ఉంటుంది అని చెప్పారు.

ఇక కొందరు వక్తలవి పేర్లు చెప్పలేను కానీ నాకు నచ్చలేదు. నాలాంటి విద్యార్థులు ఆ ప్రసంగం నుంచీ నేర్చుకోవాలి అంటే పొందికగా articulate చేసి మాట్లాడాలి . అలా కాకుండా సమయ పాలన లేకుండా out of the topic ప్రసంగిస్తే నాలాంటి దానికి ఉన్న ఆసక్తి కూడా పోతుంది. శ్యామల దశిక గారి కథా విశ్లేషణ, ఉమాభారతి గారి డయాస్పోరా కథలు లాంటి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఫణి డొక్కా గారి కథా పఠనం నవ్వించి నవ్వించి పొట్ట నొప్పి పుట్టేలా చేసింది. మధ్యలో మూడు ముఖ్య ప్రసంగాలు మిస్ అయ్యాను (బోల్డన్ని కబుర్లు లలిత ప్రసంగం అందులో ఒకటి).ఎందుకో కూడా చెప్తాను.

శారద పూర్ణా శొంఠి గారు లాంటి వారిని కలవడం ఈ జన్మలో చేసుకున్న అదృష్టంలో ఒకటి. ఆ ఉన్న రెండు రోజులు పొద్దున్నే వారి పాదాలకు నమస్కారం చేసుకోవడం నవరాత్రులలో అమ్మ అనుగ్రహం.

నా ప్రసంగం శనివారం సాయంత్రం ఉండాలి. కానీ సమయం సరిపోనందువల్ల ఆదివారం పొద్దుటికి postpone అయ్యింది. ప్రసంగాలు మిస్ అయ్యాను అన్నాను కదా. చెప్తా ఆ సంగతి. నా గోల! నా చీరల పిచ్చి తెల్సిందే కదా. సాయంత్రం కదా నా ప్రసంగం . చీర మార్చుకోవడం నెమ్మదిగా చేయచ్చుగా. తొందర !! మధ్యలో పరిగెత్తుకుంటూ బసకు వెళ్ళి వచ్చేసరికి ఈ ప్రసంగాలు కాస్తా అయ్యిపోయాయి. ఈ లోపల నా ప్రసంగం నిర్వాహకురాలు గారు గీత గారు వచ్చి ‘మనది postpone అయ్యింది తెలుసా ‘ అన్నారు . ‘ అయ్యో చీర ‘ అంటే ‘నేనిస్తాను పర్వాలేదు ‘ అని ఆవిడ 😀.
‘నా బాధ అది కాదండీ . రేపటికి తెచ్చుకున్న చీర ఇదివరకు మనబడిలో speech అప్పుడు కట్టేసుకున్నాను. నా ఛానల్ చూసిన వాళ్ళు స్పీచ్ అంటే ఈవిడ ఎప్పుడూ అదే చీర కట్టుకుంటుంది అనుకుంటారు ‘ అని చెప్తుంటే, అటుగా వెళ్తున్న చిట్టెంరాజు గారు ‘ఏవిటీ ఆ పిల్ల మీద ధుమధుమలాడుతున్నావ్ ‘ అన్నారు. ఈలోగా మా ఆచార్యుల వారు కనపడి ‘postpone అయ్యింది మీ group . అయ్యో పాపం చీర కూడా మార్చుకొచ్చినట్లున్నావ్’ అన్నారు. ‘గురువు గారు . మీకే నా బాధ అర్ధమయ్యిందండీ’ అనేశాను 😂.

శనివారం రాత్రి కిరణ్ ప్రభ గారికీ , కాంతి కిరణ్ గారికి జీవన సాఫల్యం పురస్కారం ఇచ్చారు . కన్నుల పండుగలా ఉండింది. . సన్మానం తరువాత వారిరువురి ప్రసంగాలు క్లుప్తంగా, అద్భుతంగా ఉన్నాయి. యూట్యూబ్ లో వారి ఛానల్ లో చూడవచ్చు. తరువాత వంగూరి చిట్టెంరాజు గారికి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ‘Mascot’ అయిన మహా అనే ఏనుగు పేరుతో ‘మహా’ అనే పురస్కారం ఇచ్చి, పూల వానలు కురిపించి సత్కరించారు. అంటే రాజు’ గారు ‘మహా’ రాజు గారు అన్నమాట. వారు సరదాగా ‘ఇక పైన ఏనుగు చాకిరీ చేయాలా’ అన్నారు. . ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సాహిత్య సేవ చేస్తున్న కిరణ్ ప్రభ దంపతులని , వంగూరి చిట్టెంరాజు గారిని ఈవిధంగా సత్కరించడం నాలాంటి వారికి చాలా ఆనందదాయకంగా అనిపించింది. ఈ సారి సదస్సు తరువాత ‘కిరణ్ ప్రభ గారికి, కాంతి కిరణ్ గారికి నేను తెలుసు’ అని చెప్పుకోగలను.

ఇక్కడ వంగూరి వారి గురించి నాకు అర్ధమయ్యింది కొంత చెప్పాలి. 2017లో మా ఊర్లో సాహితీ సదస్సు పెట్టినపుడు , నన్ను ‘ఏదో ఒకటి మాట్లాడు’ అన్నారు. ‘నాకేం రాదండీ’ అంటే , ‘ నీ బ్లాగులో రైలాటే చదువు. బావుంది కదా ‘ అన్నారు. అంటే దీన్ని బట్టి కొత్త రచయితలని ఎలా ప్రోత్సహిస్తారో అనేది స్పష్టమవుతుంది. వచ్చేస్తుంటే ‘అంతా సవ్యంగా అనిపించిందా నీకు ‘ అని తండ్రి గారు అడిగినట్లు ప్రశ్న. పరాయి దేశంలో ఎవరడుగుతారు ఇంత ఆప్యాయంగా ? అందుకే అంటాను. నేర్చుకోవాలే కానీ అమెరికాలో ఇటువంటి వారు మా తరం వారికీ ఓ గురువుల్లా ఒక direction చూపిస్తూ ఉంటారు. వీళ్ళని ఏదో పనీపాటూ లేని వారీగా జమ కడుతూ ‘నాకే అన్నీ తెలుసు’ అనుకుంటే ఇటువంటి వారు సాంగత్యం దొరకదు.

మళ్ళీ నా గోల కి వచ్చేద్దాం ! ఆ తర్వాత ఆదివారం పొద్దున మొట్టమొదటి ప్రసంగం నాదే. ఆ విధంగా postpone అవ్వటం నాకు మంచికే. సభలో ఉన్నవాళ్లు ప్రసంగం ఎలా ఉన్నా చచ్చినట్టు వినాల్సిందేగా ! ‘break’ అని చెప్పడానికి కూడా వీల్లేదు మరి . ఎందుకంటే అప్పుడే breakfast అయ్యింది గా ! నా ప్రసంగం వీడియో చూసినవారికి అర్ధమయ్యే ఉంటుంది. నేను ముఖ పుస్తకంలో వ్రాసుకునే ఆలోచనలన్నీ గబగబా పాఠం అప్పజెప్పినట్లు చెప్పేసాను. రెండు నిముషాలు మించిపోయింది. గీత గారు ఏమీ అనలేదు పాపం.

చాలా సన్నిహితమైన నా స్నేహితురాలు కూడా అక్కడే ఆ ఊర్లో ఉంటుంది. వెళ్ళినపుడు తనని కూడా కలవచ్చు అనుకున్నాను కూడా. ఎప్పుడు వెళ్ళినా వాళ్లింట్లోనే ఉంటాము. అస్సలు రాలేదని , కలిసి ఏళ్ళు గడిపోయాయని తను అంటుంటే 2:30 కల్లా సభనుంచి సెలవు తీసుకున్నాను రాత్రికే తిరుగు ప్రయాణం. అందుకే ఆదివారం కూడా కొన్ని ప్రసంగాలు miss చేసుకున్నాను. తిరిగి వచ్చేస్తుంటే ఏదో ఆత్మీయులని వదిలి వచ్చిన ఫీలింగ్.

స్నేహితురాలు వాళ్ళింటికి వెళ్ళగానే వారి పక్క ఇంట్లో తమిళులు బొమ్మలకొలువు పేరంటం పిలిచారు. వెళ్లి అమ్మవారిని చూసుకుని, భోజనం చేసి , మా స్నేహితురాలింట్లో persimmon పళ్ళు కోసుకుని , తిని , pack చేసుకున్నాను. వెంటనే తిరుగు ప్రయాణం.

సోమవారం పొద్దున్నే ఇంట్లో విజయ దశమి వేడుకలు చేసుకున్నాను.

India, that is Bharat -అంతేగా 

ప్రపంచంలో  భారతదేశం ఒక్కటే అనుకుంటాను colonists ని పూజిస్తుంది.

  ఈ రోజు ఓ స్నేహితురాలు ముఖపుస్తకంలోనే  కొన్ని ఫోటోలు పెడుతూ  ‘Dalhousie’ అని వ్రాసింది.  అసలు ఆ ఊరు ఉందని,  అదొక hill resort  అని , హిమాచల్ ప్రదేశ్లో ఉందని నిజంగా నాకు తెలీదు.  నాకు తెలిసినవాడు ఒక్కడే ఆ పేరుతో ‘Lord Dalhousie’ .  పైగా ఆ ఊర్లో ఓ గుర్తు యూట్యూబ్ చెప్పింది .  ‘I LOVE DALHOUSIE’ . అది చూసి బిత్తరపోయాను. ఆ ఊరికి  ఆ పేరు ఎందుకు ఉందో  కూడా సగం తెలీదు మనకి.  

‘Dalhousie Town was named after The Earl of Dalhousie, who was the British Governor-General in India while establishing this place as a summer retreat’   అని వికీపీడియా చెప్పింది.  

ప్రపంచంలో లేని వింతలన్నీ భారతదేశంలోనే జరుగుతాయేమో . అందుకే  ‘India, that is Bharat’ అయ్యింది (ప్రపంచంలో ఏ దేశానికి రెండు పేర్లు ఉండవు )

ముక్తిక్షేత్రం

ఈమధ్య తూర్పు దేశాలలో ( భారత దేశపు) ఒక దేశానికి చెందిన తెలిసిన అమ్మాయితో కబుర్లు చెప్తున్నా. తన vacation ఫోటోలు అంటూ చూపింది. చాలా మటుకు ఫోటోలు చిన్న వస్త్రం ఒకటి ధరించి ఈ అమ్మాయి ఏదో పానీయం త్రాగుతూ నీలి సముద్రం ఒడ్డున కూర్చున్నవి కనిపించాయి. ఆ ద్వీపం గురించి చాలా చెప్పింది.

తరువాత ‘vacation అంటే నువ్వెక్కడ పోతుంటావ్ ‘ అని అడిగింది నన్ను.

‘నా జీవితంలో రెండు ఖరీదైన vacations వెళ్ళాను . చాలనిపించింది. ఇక పై సమయం, డబ్బు ఉంటే భారత్ తప్ప ఇంకో చోటికి వెళ్ళను . నా జీవితం సరిపోదు. చూడటానికి అన్ని ప్రదేశాలు ఉన్నాయి ‘ అని చెప్తే కొంచెం వింతగా చూసింది. ‘అంత ఉందా చూడటానికి’ అన్నట్లు అనుకుందేమో.

‘ఇండియా చూసినవాళ్ళు చెప్పారు కొందరు. హోటల్లో ఉన్నంతసేపు బానే ఉంటుందట. కానీ మాములుగా బయటికి వెళ్తే చాలా బీదతనం కనిపిస్తుందట. అందుకే India నా list లో లేదు’ అన్నది.

ఆ మాటకి ‘అనువుగాని చోట అధికులమన రాదు’ అన్నది గుర్తొచ్చి సమాధానం ఏమీ చెప్పక , ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను. ఆ నవ్వులో ఆవిడకి అర్ధం కాని విషయం ‘ ఎంత పిచ్చి దానివే తల్లీ’ అన్న మాట అనుకున్నాను అని.

*************************************************************

ఈ కథంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది వరకు భారతదేశంని తల్చుకుంటే emotional గా అనిపించినపుడు ‘ నేను పుట్టిన దేశం కదా అందుకని ఆ ప్రేమ ఉంటుంది’ అనుకునేదాన్ని. గత ఏడాది మా నాన్న గారిని చూసుకునే వంకతో మూడు నెలలు గడిపాను. ఇక్కడ సంసారం ఉన్నా భారత్ వదల్లేక, వదల్లేక వదిలి వచ్చాను. ఏదో శక్తి లాగుతోంది అనిపించింది. ఆలోచిస్తే అర్ధమయింది ఏమిటి అంటే ‘అమెరికాలో ఉన్నాను. నాకు అన్నీ ఉన్నాయి’ అనుకోవడం ఉత్తభ్రమ. భారత్ లో ఉండేవారు అష్టైశ్వర్యాలు ఉన్నవారు . తల్చుకోవాలే కానీ ఏ గుడికి వెళ్ళాలి అనుకుంటారో వెంటనే వెళ్లగలిగే స్థితిలో ఉంటారు. .

ఈ ఆలోచనలు నాన్న వెళ్లిపోయారని, ఆ బెంగతో వస్తున్నాయా అని కూడా అనిపించేది. నా ఆలోచనలకి ఓ సమాధానం వచ్చింది ‘ముక్తిక్షేత్రం’ రూపంలో. అనుకోకుండా రమా శాండిల్య గారి సుమన్ టీవీ లో ఆవిడ పుస్తకం మీద series చూసాను. చాలా మటుకు సమాధానం వచ్చింది. మొత్తానికి ఆ పుస్తకం తెప్పించుకున్నాను. కార్తీకమాసం చివరి సోమవారంలో చేతికి వచ్చింది పుస్తకం. చదవడం త్వరగానే పూర్తి చేశాను.

‘నాకేం తెలీదు. నేనేమి చదువుకోలేదు’ అంటూనే ఓ చిన్న పుస్తకంలో చెప్పవలసిన విషయాలు చెప్పారు రచయిత్రి. కాశీ అంటే ముఖ్యమైన గుడులు, గంగా హారతి, తర్పణాలు ఇటువంటివే తెలుస్తాయి నా లాంటి దానికి. కాశీ క్షేత్రం ఎందుకు ప్రాముఖ్యం అనే విషయం హరిబాబు గారు వైజ్ఞానికంగా ఏవిధంగా చూడాలో ఒక వ్యాసం లో చెప్పారు. ఆ వ్యాసం మొత్తం గుర్తులేదు. కానీ అక్కడ మన ఊహకు అందనివి ఎన్నో ఉన్నాయి అని స్పష్టంగా అర్ధమవుతుంది. ఆ విధంగా మనం connect చేసుకోగాలి కానీ అటువంటి ఎన్నో తెలియని విషయాలు చిన్న చిన్న మాటలలో చెప్పేస్తారు రమా గారు. కొన్ని కొన్ని అద్భుతమైన విషయాలు ఆవిడకి చెప్పినది ఎవరు అంటే పడవ సరంగుల్లాంటి వారు. ‘వాళ్ళు చెప్పిన మాటలు విని ఈవిడ పుస్తకం వ్రాయడమేంటి’ అనుకుంటారేమో. ఎప్పుడైనా చూడండి . సత్యం మనం గ్రహించుకోవాలే కానీ జానపదుల్లోనే అసలు సిసలైన తత్త్వం మాట్లాడటం కనిపిస్తుంది.

యాత్ర అంటే ‘ఇది చూశామా , చెక్ పెట్టుకున్నామా’ అనే భావం ఉండదు రచయిత్రి చెప్పే మాటల్లో. ఆ యాత్రని ఆవిడ ఆస్వాదించిన విధానం ప్రతీ మాటలో కనిపిస్తుంది. ఓ పుణ్యక్షేత్రం వెళ్తే మన దృష్టికోణం మారిపోతుంది ఈ పుస్తకం చదివితే.

కాశీ వెళ్ళాలి అనుకునేవారికి ఇదొక గైడ్ లాగా ఉంటుంది కూడా. పంచ గంగా స్నానం, నవ దుర్గలు, పంచ క్రోశి యాత్ర, ద్వాదశాదిత్యులు, గంగా హారతి ఇలా మనం కాశీ వెళితే ఏదీ miss అయిపోకుండా ఉండేందుకు తెలియనివి ఎన్నో చెప్తారు.

ఙ్ఞానవాపి లో నందీశ్వరుడి గురించి, అక్కడ బావి గురించిన ప్రస్తావన కూడా చేసారు. అప్పటికి ఈ కోర్టు కేసులు అవి ఏమీ జరగలేదు.

హారతి ఇచ్చేముందు ‘గంగమ్మ’ వచ్చి ఆవిడ పక్కన కూర్చున్న విధానం చదివితే అర్ధమవుతుంది రచయిత్రి ఎంతటి ధ్యానంలో ఉన్నారు అని. ‘కాశీ అంటే పుట్టిల్లు . అమ్మ, నాన్నలుండే ఊరు’ అంటారు వారు. ఎంతో మంది కాశీ యాత్ర చేస్తారు. ఎవ్వరి దగ్గరా ఈ మాట వినలేదు నేను. ఆ ప్రదేశంలో ‘ కాశీ’ అనే భావం మనసుకి తాకుతుంది అంటారు. ‘కాశీ నేనే’ అని చెప్తారు చివరికి.

ఇంత చెప్తుంటే ఆవిడ భక్తి అమోఘం అనుకుంటాం కదా. ‘లేదు నేను బాహ్య ప్రపంచంలో కూడా ఉంటాను’ అంటూ ఉన్నట్టుండి బెనారస్ చీరల గురించి చెప్తారు రచయిత్రి. ‘అదే మాయ’ అంటే అంటారు కూడా.

చిత్రకారులు కూచిగారు పుస్తకం చిత్రం సరిగ్గ్గా ఆవిడ ఆలోచనలకి అద్దం పట్టేలా వేశారు. పుస్తకం చదివితే ఆ ఆలోచనలు ఏమిటో ఎందుకు వేసారో అర్ధమవుతుంది.

చిన్న వయసులో భర్తని కోల్పోయి అల్లకల్లోలం అయిన మనసుతో కాశీ కి వెళ్ళిన ఆవిడకి, దొరకవలసిన నిధి దొరికింది అనిపించింది నాకు. ఎంతటి కష్టాన్నయినా ధైర్యం తో ఎదుర్కోగలగడం అనేది భారతీయ సంస్కృతిలోనే ఉంది అని చెప్పడానికి రమా గారి పుస్తకమే ప్రత్యక్ష సాక్ష్యం.

నా ఉద్దేశ్యంలో భగవంతుడు కొందరిని కొన్ని పనులకి వినియోగించుకుంటాడు. అందుకే అసలు వారికే కష్టాలు వస్తాయేమో అనిపిస్తుంది నాకు. అటువంటి వారి సాంగత్యం దొరకడం కూడా ఎప్పుడో చేసుకున్న పుణ్యం. ‘సత్సంగత్వే నిస్సంగత్వం’.

ఇంత శక్తి గల క్షేత్రాలు తెలుసుకోలేని భారతీయులు ‘అష్టైశ్వర్యాలు అంటే ఎక్కడో ఉన్నాయి’ అనుకోవడం ఎండమావుల వెంటపడటమే !

ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, మా నాన్నగారి కోరిక మేరకు అమ్మను తీసుకుని కామాఖ్య వెళితే అక్కడ నర్మదా నది బాణలింగం దొరకడం ఏమిటో, రమా శాండిల్య గారి ‘ముక్తిక్షేత్రం ‘ కార్తీక మాసంలో రావడం ఏంటో అని. సంబంధం ఉంది అనుకుంటే ఉంది . లేకపోతే లేదు.

వీరు వ్రాసినవి ఇంకో రెండు పుస్తకాలు ఉన్నాయి. book fair లో Writers stall లో ఉన్నాయి. వెళ్లే వారు తప్పక కొనుక్కోండి. ఏ మాత్రం disappoint అవ్వరు.

వెలకట్టలేని కానుకలు

‘ముఖపుస్తకం ఓ addiction . అది పనీ పాటా లేని వాళ్ళకి సోషల్ మీడియా ‘ అని మాట్లాడే వాళ్ళని అంగీకరించను. ‘శ్రీవల్లీ రాధిక గారి కథలు చదవండీ చాలా బావుంటాయి’ అంటూ ఓ ముఖ పుస్తకం స్నేహితురాలు కానుకగా పంపించారు. వచ్చినట్లు పొద్దున్నే ఫోటో వచ్చింది. ఇక నా దగ్గరికి రావడానికి ఇంకో రెండు వారాలు పడుతుంది. నేను మాట్లాడేది నచ్చక ‘ఒక కంచం ఒక మంచం’ అంటూ నాతో చదువుకున్న నా చిన్నప్పటి స్నేహితులే నన్ను దూరం పెట్టేస్తున్నారు. అటువంటిది ఇలా వెలకట్టలేని కానుకలు ముఖపుస్తకంలో నా ‘ముఖం’ కూడా చూడని వాళ్ళు ఇలా పంపితే ఆ ఆనందం వేరు 😀. వారెవరో చెప్పలేను. వారికి అనేకానేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను 🙏🙏.

ఇలాగే ఒకసారి బ్లాగు మిత్రులు ఒకరు ఉషశ్రీ రామాయణం పంపారు. సరిగ్గా ఎప్పుడు వచ్చిందంటే మా 20 ఏళ్ళ పెళ్లి రోజు వేడుకలకి. మా అమ్మ, నాన్న వస్తూ తెచ్చి ఇచ్చారు. ఎంత సంతోషం వేసిందో .

నాకు పుస్తకం కానుకగా ఇచ్చిన వారే చెప్పిందే కాకుండా, శ్రీవల్లీ రాధిక గారి సాహిత్యం గురించి చాలా విన్నాను. కానీ నేను చదివినవి చాలా కొద్దిపాటి. వారి బ్లాగులో కొన్ని, ఈమాట లో కొన్ని కథలు చదివాను. చక్కటి తెలుగు సాహిత్యం కరువయిపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి వారు వ్రాసినవి తప్పక చదవాలి.

ఈ పుస్తకమే కాకుండా శ్రీవల్లీ రాధిక గారి ఇతర పుస్తకాలు book fair లో ఇక్కడ ఉన్నాయిట . book fair కి వెళ్తున్న వారు కొనుక్కోవచ్చు.

1) హేలగా ఆనంద డోలగా..

2) రసశేవధి

3) ఆమె నడిచే దారిలో..

ఈ మూడు పుస్తకాలూ ఉంటాయి ఈ సంవత్సరం బుక్ఎగ్జిబిషన్‌లో.

* అచ్చంగా తెలుగు (stall no 257)

* KATHAMRUTAM (stall No. 82,83)

* అక్షరయాన్ (stall no 106)

ఈ మూడు చోట్లా దొరుకుతాయి

మళ్ళీ బ్లాగులోకానికి వచ్చా

బ్లాగు వ్రాసి చాలా రోజులయింది.  ఎక్కువగా ముఖపుస్తకంలోనే  వ్రాసేస్తున్నాను. ఈరోజు మాలిక చూసాక ‘అయ్యో బ్లాగు ఎందుకలా వదిలేస్తున్నాను’ అని దిగులేసింది. కనీసం ముఖపుస్తకం లో టపాలన్నీ దాచుకునే ప్రయత్నం అయినా చేద్దాం అనిపించింది. 

బ్లాగులో వ్రాసి ఆ లంకె ముఖ పుస్తకంలో పెడితే ఆ లంకె కూడా నొక్కట్లేదు జనాలు.  ‘చేరవలసిన విషయం ఎలాగూ  చేరిపోతోంది’ అని బ్లాగుని తగ్గించేసాను. 

ముఖపుస్తకం లాగే ఎంతో మంది మంచి స్నేహితులని ఇచ్చింది బ్లాగు.  ఆ స్నేహాల కోసం మళ్ళీ వచ్చాను.  తరచూ వ్రాయడానికి ప్రయత్నిస్తాను 

Celebrating Life of Mr.Google

మా నాన్న గారు  మార్చి  29, 2022న  శరీరాన్ని విడిచి వెళ్ళారు .  

క్లుప్తంగా చెప్పాలి అంటే ఆయనకి తెలియని విషయం అంటూ ఉండేది కాదు.   అది బ్యాంకు ఉద్యోగం వల్ల  కొంత, స్వతహాగా ఉన్న ఆసక్తి వలన.

కంప్యూటర్ లు వచ్చాక ఆ రోజుల్లోనే  ఓ పక్క ఉద్యోగం చేస్తూనే COBOL నేర్చుకున్నారు. Internet  వచ్చాక email  ఎలా వ్రాయాలో మొదలు పెట్టి ,  networking దాకా నేర్చేసుకున్నారు.  ఇంట్లో ఎవరిదైనా సరే తనే  ఆ computer  fix  చేసేవారు.   ఎప్పుడూ అందరికీ  hard drive  ఒకటి తెచ్చుకుని backup  చేసి ఇచ్చే వారు.  ఇక smart  phones తో కూడా  అలాగే చేసేవారు.  BSNL వాళ్ళ కంటే మా నాన్నకే  బాగా తెలిసేది .  

ఆ BSNL  అంటే మహా ఇష్టం. ‘public sector ని అంటే ఊరుకోను’  అని ఖచ్చితంగా మొహాన చెప్పేవారు.  Facebook లో కూడా చాలా active గా ఉండేవారు.  తెలుగు బ్లాగులు నాకు పరిచయం చేసింది మా నాన్న గారే .  ‘కూడలి’ చూపించారు.  ‘కష్టేఫలి’  శర్మ గారి బ్లాగు గురించి , శర్మగారి చెప్పే విషయాలు చాలా నచ్చేది ఆయనకి.  ‘ భండారు’ వారు ఆయనకి ముఖపుస్తకంలో పరిచయమే. 

‘మోదీ’ ఇష్టమే కానీ ‘opposition లేకపోవడం పెద్ద drawback. భక్తుల్లా మాట్లాడతారు మీరంతా.  అసలు విమర్శించకూడదు అన్నట్లు ఉంటే  ఎలా’  అని మాతో పెద్ద వాదనలు వాదించేవారు.  

ఎంత ఓపిక లేకపోయినా లేచి ఆ కంప్యూటర్ కుర్చీ దగ్గరికి వెళ్ళి  ఓ అరగంట సేపు ముఖపుస్తకం లో గడిపేవారు. రష్యా యుక్రెయిన్  యుద్ధం గురించి మనవళ్ళు , మనవరాళ్ళు  analysis ఇవ్వమని అడిగారు.  ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని మాట్లాడారు. 

అందుకే ఆయన వెళ్ళిపోయాక  ఆ 13 రోజులు  మేము ‘ Celebrating Life of Mr.Google’ అనే title  ఇచ్చాము.  ఆయన  లేని మా జీవితాలని మాములుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాము. 

నా పాత  టపాల  లంకెలు :

నా EAMCET కథ
మహనీయ మధురమూర్తే

మా అక్కయ్య ముఖపుస్తకం లో  వ్రాసిన టపా కూడా పదిలంగా  బ్లాగులో దాచుకుందామని  ఇక్కడ post  చేస్తున్నాను. 

చూస్తుండగానే నాన్న వెళ్ళిపోయి 3 వారాలు కావస్తోంది.
ఆయన లేరు అనే నిజం ఇంకా జీర్ణం అవట్లేదు.
మరి కన్న తండ్రి కదా అలాగే ఉంటుంది అన్నారు ఎవరో.
నాన్న just నాన్న మాత్రమే కాదు కదా.


మా Facebook friend. సంగీత, సాహిత్య మిత్రులు. , a curious learner , a mischievous kid who would change all our gadget passwords and watch fun.


అందుకే ఎన్నో విధాలుగా ప్రతి నిమిషం నాన్న ని miss అవుతున్నా.
అమ్మ అనేది ” ఎప్పుడు ఆ పుస్తకాలు కంప్యూటర్లు తప్ప పిల్లలకు ఏం పెట్టాలి ఏంఇవ్వాలి అని ధ్యాస లేదు” అని.
నాన్న ఇచ్చిన ఆస్తి దేనికి కొలమానం.???


మంగళంపల్లి వారి “నగుమోము” enjoy చెయ్యటం నేర్పింది నాన్న. త్యాగరాజ పంచమికి పంచరత్నాలు live తిరువాయుర్ నుంచి చూడటం, ఎక్కడ మంచి కచేరి వున్నా తీసుకెళ్లడం. దాదాపు ప్రతి పెద్ద కళాకారులని లైవ్ లో చూడగలగటం నేర్పింది నాన్నే .


రేడియో వినిపించడం మాత్రమేనా, ఆలిండియా రేడియో కి పట్టుకెళ్లి అక్కయ్యలని, మామయ్యాలని ఏకాంబరాన్ని చూపించింది మా మొహల్లో excitement తెచ్చింది నాన్న.


రైల్ అందరూ ఎక్కుతారు. ఇంజిన్ ఎక్కించారు, స్టేషన్ లో సిగ్నల్ రూమ్ కి పట్టుకెళ్లారు.
తమిళనాడు సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో A/C First class ఎక్కించారు, just ఆ feel కోసం.(డబ్బు వుండి కాదు, LTC లో మరి కాస్త వేసుకుని), ఒకసారి రామేశ్వరం.నుంచి మద్రాసు దాకా Heritage Compartment లో పట్టుకెళ్లి మా ముగ్గురికి రాజుల కాలం ఫీల్ తెప్పించారు.

LTC లో కాస్త డబ్బు చేర్చి మొదటి సారి మాకు flight ఎక్కిన అనుభవం నాన్న వల్లే.
చాలమంది మా తోటి స్నేహితుల parents డబ్బులు దాచుకుంటే, నాన్న మమ్మల్ని దేశం లో తిప్పని ప్రదేశం.లేదు.


ముగ్గుర్ని తీసుకుని పెరేడ్ గ్రౌండ్స్ లో రంజీ ట్రోఫీ మాచ్ కి పట్టుకెళ్లి, స్టాండ్స్ లో కూర్చుని మాచ్ చూడటం లో థ్రిల్ చూపించారు.


పానిపురి తినాలన్న మిర్చి బజ్జి అయినా , మంచి కాఫీ అయిన నాన్నే.

Survey of India లో మాప్ లు తెచ్చి how to read maps చెప్పింది నాన్నే.

పుస్తకాల విషయంలో చెప్పనక్కర్లేదు.
నాకు పుస్తకాల పిచ్చి నాన్న వల్లే. చిన్నపుడు మొగల్ లైబ్రరీ కి వెళ్లడం తో మొదలయింది మా book friendship.”ఇదిగో ఈ bookచదువు” అంటూ ఇంటికి వెళ్ళగానే ఒకటి విసిరేసేవారు.
‘దుమ్ము ఉంటుంది, ఆయాసం వస్తుంది’ అని అమ్మ అరుస్తున్నా, నా ఆఫీస్ కి వచ్చి ‘Book Exhibition కి వెళ్దాం అమ్మకి చెప్పకు’ అంటూ ఆ పుస్తక వ్యసనానికి మూలం నాన్న.
అమ్మ అనేది “ఆడపిల్ల వచ్చింది ఒక చీర పెట్టామా లేదా అక్కర్లేదు, ఆ పుస్తకాలు ఇస్తే చాలా?” అని. చాలాదా!!కోట్ల రూపాయల విలువ . పుస్తకం కాదు. అది చదివి ఆయనతో చేసే డిస్కషన్. ఆయన reasoning. In this society emotions are over rated than practicality అని నవ్వేవారు.

ప్రతి విషయం మీద ఒక view ఉండాలి అని అనేవారు.
అటు politics అయిన, ఇటు మతపర విషయం అయినా, సాంఘిక విషయాలు అయినా చర్చ జరగలసిందే. నాకు తెలిసి మా ముగ్గురికి ఒక్కసారి కూడా text booksచదవమని చెప్పింది లేదు. అయినా మెమెప్పుడు చదువు నిర్లక్ష్యం చేసింది లేదు.

ఎప్పుడు తెలుగు సాహిత్యం, ఇంగ్లీష్ fiction, travelogues, national geographic magazines, readers digest. ఒకటేమిటి అన్ని రకాల బుక్స్.
నా ట్రావెల్ పిచ్చి కి, ఎప్పటికయినా జీవితం లో భూభ్రమణం చేయాలనే నా కోరిక కి బీజం నాన్నే.

బాపు రమణలని , బుడుగు ని పరిచయమ్ చేసింది నాన్న.

కున్నకుడి “కావేరి ” వయోలిన్ రుచి చూపించింది నాన్న.

Lalgudi violin కానీ “west meets east” by రవి శంకర్ కానీ , మంచి హిందీ పాటలు కానీ వినటం అలవాటు చేసింది నాన్న.
.
రిటైర్ అయిన వాళ్ళు , అమెరికా వెళ్లిన పెద్దవాళ్ళు ఎంతో మంది బోర్ బోర్ అంటుంటే, నాన్న మాత్రం లైబ్రరీ కో, మైక్రో సెంటర్ కో వెళ్లి అలా రోజులు గడిపే వారు. అలా ఒక కంప్యూటర్ ముందు వేసుకుని గంటలు గడిపేసే వారు
ఒక్క రోజు ఆయన నోట్లో బొర్ అనే.మాట వినలేదు.


enjoying life has nothing to do with physical assets అని అనడానికి నాన్నే నిర్వచనం.


కాదేదీ కవితకనర్హం లాగా
ఒక చిన్న రైల్ ప్రయాణం అయినా, ఒక పుస్తకం అయిన, ఒక పాట అయిన , స్నేహితులతో గడపటం అయిన జీవితాన్ని అంత enjoy చెయ్యచ్చు అని తెలుసుకుంది నాన్న వల్లే.
చిన్నతనం లొనే తండ్రిని పోగొట్టుకుని, పెద్దకొడుకుగా గంభీరంగా బాద్యతలు తీసుకున్న నాన్నే మా ఆదర్శం మరి.


జీవిత కాలం నాన్నతో ప్రాణస్నేహితులు గా ఉన్న శివరాం మామయ్య ,సోమశేఖర్ మామయ్య , రంగనాథ్ మామయ్య ల, అనుబంధంలాతో (uncle అనే పిలుపు లేవు అందరిని మామయ్య అనాల్సిందే) స్నేహం విలువ చెప్పారు నాన్న.
సక్సెస్ అంటే నాన్న definition వేరే.


Technologyఆంటే ప్రాణం నాన్నకి. అన్ని నేర్చికుని మనవళ్ళ computer passwords మార్చేసి వాళ్ళని ఏడిపించిన Modern తాత.. Computer time కోసం పిల్లలతో సమానం గా పొట్లాడిన చిన్న పిల్లాడు నాన్న.
అలాంటి నాన్న ఏదో కొత్త technology తో స్వర్గం నుంచి wifi లో contact లోకి తొందరగా రాకపోతారా!!!

హిందూ ధర్మ పరిరక్షణలో స్త్రీలు

హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అంటూ మాట్లాడేవారిని బోలేడు మందిని చూస్తున్నాను భారత్  లో .  FB  లో కూడా request లు వస్తుంటాయి.  చాలా బాధ కలిగిస్తున్న అంశం ఏంటంటే మగవారే మాట్లాడుతున్నారు.  ఈ విషయం మీద మాట్లాడే ఆడవారు చాలా తక్కువ.  అసలు లేరు అనను. ఉన్నా బయటికి మాట్లాడాలి అని నియమం కూడా లేదు. కాబట్టి, నాకు కనబడక పోయి ఉండచ్చు కూడా.  ఏది ఏమయినా ఉన్నవారు మాత్రం చాలా తక్కువ శాతం. ఒక్కటి మాత్రం సత్యం. ఆ ఉన్నవారు  మాత్రం దుర్గ మాతలే . కాబట్టి నేను అనేది ఏంటంటే హిందూ ధర్మం  భూమి మీద  ఉండాలి  అంటే ఖచ్చితంగా ఈ శాతం పెరగాలి. 

కానీ  అందుకు భిన్నంగా ఈ విషయంలో ఆడవారు ఎందుకు ఇంత నిర్లిప్తతగా ఉంటున్నారు ?

ఇది వరకు రోజుల్లో ఆడవారు బయటికి వెళ్ళి చదువుకునే వారు కాదు.  ఇంట్లోనే  అన్నీ నేర్చుకునేవారు.  ఇందుకు గజేంద్ర మోక్షమో , పోతన పద్యాలూ ఉదాహరణలు.  మా అమ్మమ్మ కి తల్లి లేకపోయినా అన్నీ మేనత్త దగ్గర నేర్చుకుంది.  అందుకే ఈ రోజుకి కూడా Balanced గా మాట్లాడుతుంది. Time management, Human relationships, values ఇటువంటివి ఈ తరం ఏ బడికీ  వెళ్లకుండానే నేర్చుకుంది. తరువాతి తరం  క్రమంగా చదువుకోవడం ఉద్యోగాలు చేయడం మొదలయింది. అక్కడ నుంచీ మొదలయింది మార్పు!!  ‘సమానంగా డబ్బు సంపాదిస్తేనే తప్ప మనకి విలువ లేదు’ అన్న mindset  నుండీ →   ‘సంపాదిస్తున్నాను . అయితే ఏంటి? నీ మాట వినాలా? ఉంటే ఉండు.  పోతేపో ‘ (లేదా) ‘ నాకు డబ్బుంది పెళ్ళెందుకు ?’  వరకు. 

ఇది వరకు స్త్రీలకి సమయం దొరికితే :

టీవీ లు లేకపోవడం ఉన్నా ఛానెల్స్  లేకపోవడం వల్ల  పుస్తకాలు చదవడం ఉండేది. రేడియో వినడం ఉండేది. కబుర్లు చెప్పుకుంటూ  crafts  చేసుకునేవారు. బుట్టలు అల్లడం, పూసలతో బొమ్మలు చేయడం (ఇవి కూడా తులసి కోటలు ,  వెంకటేశ్వర  స్వామి , దేవుడి మందిరం వంటివి)  ఇప్పుడు టీవీ సీరియల్స్ చోటు చేసుకున్నాయి. వాట్సాప్ లో ఏ పూజలు ఎలా చేయాలి అంటూ చాదస్తం తో  కూడిన సందేశాలు,  వీడియోలు.  ఎందుకు చేస్తున్నాం అనే లాజిక్  పోయింది.  ( సరదాగా కట్టుకుందాం అని దసరాల్లో చీరల రంగులు పెట్టా ఒకసారి. లలితా  సహస్రనామం గుంపులో.  ఇక పండగ తేదీల గురించి, చీరల  రంగుల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కటి.  సరే పూజ చేసాక ఒక నామం  గురించి చెప్పినా వినే  స్థితిలో ఉండరు.) సరే. ఇక కిట్టీ పార్టీలు. అవి ఎందుకు  చేస్తారో అవి అర్ధం కాదు. ఒకప్పుడు డబ్బుల్లేక ఒక వస్తువు ఏర్పరుచుకోవడానికి ఇలాంటివి ఏవో పెట్టుకున్నారు. అవి కాస్తా ఇప్పుడు ఒక socializing  events లాగా అయ్యాయి. ఇదొక కోణం. “కట్టిన చీర కట్టకూడదు. పెట్టిన నగ  పెట్టకూడదు” సోషల్ మీడియా వల్ల ఒక రకమైన పోటీతత్వం విపరీతంగా పెరిగిపోయింది. అంతే కాదు ‘మా కిచెన్ చూడండి , ఈ చీర కొనుక్కోండి, ఈ కొత్త వంటకం చేయండి’ లాంటి వీడియోలు.    ఒకప్పుడు సమయాన్ని సద్వినియోగ పరచుకునే వారు crafts  అటువంటివి పూర్తిగా మర్చిపోయారు. ఉన్న కళలని  కూడా చంపేసాయి.  ఉన్న కొద్దిపాటి సమయం  వీటికే అంకితం చేస్తున్నారు. Basically , తర్కం తో కూడిన mindset పోయింది. 

 ఆడవాళ్లదేనా తప్పు . మగవారిది లేదా అంటే ఎందుకు లేదు? బోలెడు.  ఓ నవల వ్రాయగలిగినంత ఉంది.  భారత్ వచ్చాక కొంత మంది  స్నేహితురాళ్ళని  కలవాలనుకుని ‘walking  వెళదామా సరదాగా’ అని ఎవరిని అడిగినా ఆదివారం కూడా రాలేనంత తీరికగా  ఉంటున్నారు . మధ్యాహ్నం రెండు తరవాతే వస్తారు. ఇంట్లో వాళ్ళ పనులు ఉంటాయి. టిఫిన్లు, పూజలు, భోజనాలు,  మళ్ళీ సాయంత్రం వంటలు.  అందుకని  వాళ్ళ permissions  తీసుకోవాలి.  40 దాటిన  ఆడవారికి permission  ఏమిటి అసలు?  ఒక్క రోజుకి  త్యాగం చేయరు ఈ మగవారు . ఆశ్చర్యం వేస్తుంది.  దీన్ని బట్టి ఒక సామాన్య స్త్రీ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే ఎంత కష్టమో ఊహించచ్చు. స్త్రీ వాదం పుట్టింది అంటే పుట్టదా మరి ? అటువంటి స్త్రీలు ధైర్యం గా ముందుకి వెళ్లడం మాట పక్కన పెడితే ,  ఆత్మ నూన్యత కి  గురి కాకుండా ఉంటే  చాలు.    

ఒక సంస్కృతిని  తరవాతి తరానికి  అందించే విషయంలో  స్త్రీదే  ముఖ్య పాత్ర.  శివాజీ తల్లి కావచ్చు.  వివేకానందుడి తల్లి కావచ్చు. .  పురాణాల్లో సీతా దేవి,  ద్రౌపది,  కుంతీ దేవి ఒక్కొక్క స్త్రీ ఎంతటి  వ్యక్తిత్వం ?  అటువంటి భారత స్త్రీ, అసలు తన  కుటుంబ వ్యవస్థ నుంచీ  ఎన్నో విధాలుగా దూరం అయిపోతోంది. ఇంక సంస్కృతి కోసం పోరాటం ఏమి చేస్తుంది?

ఈ విగ్రహం అవసరమా?

భారత సంతతి/హిందువులు అనగానే ప్రపంచానికి తెలిసింది ‘Caste’ అంటే కులము అన్నమాట. ఆ మాట తప్పించుకుని అమెరికా వచ్చేసాం అనుకున్నా అమెరికాలో ‘caste based discrimination’ అంటూ పెట్టి , ఇది ‘ south Asians’ కి మాత్రమే apply అవుతుంది అని చెప్తున్నారు. కాలేజీల్లో మొదలు పెడుతున్నారు. ఇక నెమ్మదిగా corporate ప్రపంచంలో కూడా మొదలుపెడతారు. అమెరికాలో చాలా మంది తల్లితండ్రులు పిల్లలకు కులం అనేది చెప్పరు . బడిలో History తరగతిలోనో , World religions తరగతిలోనో చాలా మటుకు ‘caste’ అన్న పదం వింటారు. ఇక పై అందరం పిల్లలకి ఏ కులం లో పుట్టామో చెప్పాలేమో. ఒక వేళ కులం తెలిసినా ఏ కులం పెద్దదో , ఏ కులం చిన్నదో చెప్పుకోవాలేమో మరి. మా నోటితోనే మా చరిత్రని వక్రీకరించి/ హీనంగా చెప్పాల్సిన సందర్భం వచ్చేసిందేమో.

దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. రామానుజాచార్యులు వారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఎందుకు జీయర్ స్వామి వారి వీడియోలు చూపించి నానా యాగీ చేయడం మొదలు పెట్టారో. . ప్రపంచంలో నీచమైన జాతి ఉన్నది అంటే ఈ వీడియోలు చూపించి, నీచాతి నీచంగా స్వామి గారి గురించి మాట్లాడే మనుష్యుల జాతి మాత్రమే.

ఇంకొందరు ఇంత ఖర్చుతో ఈ విగ్రహం అవసరమా అని అంటున్నారు. ప్రపంచంలో ప్రతీ హిందువు ఐడెంటిటీ అద్వైతం/ద్వైతం అన్న సిద్ధాంతం ఏది ఎక్కడా చెప్పకుండా కులం అనేది ఓ identity చేసారు. దారుణం ఏంటంటే కర్మ ఫల సిద్ధాంతాన్ని కూడా కులముతో ముడి పెడతారు. హిందూ మతంలో పుట్టిన భావి తరాలవారు ‘నా identity నా కులం కాదు’ అని ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా చెప్పుకునేందుకు ఏదీ వద్దా? ‘మానవులంతా సమానమే ‘ అంటూ చెబుతూ ఇప్పుడు ఈ విగ్రహం ముందు ముందు చెప్పుకునే చరిత్ర అవ్వబోతోంది. కాబట్టి ‘ ఈ విగ్రహానికి అవసరమా ? ఇంతా ఖర్చా ‘ అని అడిగేవారు దయచేసి అలా మాట్లాడవద్దు మనవి 🙏🙏🙏. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా అవసరం ఉంది

ఇది వరకు పటేల్ గారి విగ్రహం ఆవిష్కరణ సందర్భంలో వ్రాసిన టపా

ఈ సంస్కృతిని రక్షించుకోవడానికి ఏమి చేయగలను?

హిందూ మతం/హిందూ సంస్కృతి/భారతీయత /సనాతన ధర్మం అనేది ప్రపంచంలోని  అన్ని సంస్కృతుల్లోకెల్లా ప్రాచీనమైనది.  ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. కానీ చరిత్రలో కనుమరుగయ్యాయి.  ఇంకా ప్రాణంతో ఉన్న సంస్కృతి ఇదొక్కటే. ఈ సంస్కృతి  రక్షించుకునేందుకు  తమదైన రీతిలో అనేక ధార్మిక సంస్థలు పోరాడుతున్నాయి.  అందులో  ఒక సంస్థ గురించి చెప్తాను.  వారు  చేస్తున్న దైవసేవ  ఏ ఆర్భాటము లేకుండా ఏదో చిన్నదిగా  ఉన్నట్లు కనిపించినా ,  భావితరాలని హిందూ మతం పాటించేటట్లు చేస్తుంది అని నాకు అనిపించింది.  అదే కదా సంస్కృతిని  కాపాడటం అంటే? 

 హిందూ మతం అనగానే అందరూ మాట్లాడేది  కులము & కుల వివక్ష.  ‘నిర్వాణ శతకం వంటివి చెప్పిన ఈ మతంలో  వివక్ష లేదు.   భగవంతుడికి అందరూ ఒక్కటే’ అని ఎన్ని చెప్పినా , పాటించేది మానవ మాత్రులం కాబట్టి కుల వివక్ష లేదు అని ఎవరం అనలేము. కానీ దానినే ఒక అవకాశంగా తీసుకుని  మత  మార్పిడులు చేస్తున్నారు అన్నది అందరికీ తెలిసిందే.  వారి నమ్మకం వారిది.  వారు మారుస్తారు.  మరి , ఎవరైనా  మతం ఎందుకు మారతారు ? 

ఏదైనా సమస్య  వచ్చినపుడు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు. ఎవరైనా ఆ సమయంలో  దైవాన్నే నమ్ముతారు.  ఆ దైవాన్ని తలచుకునే వ్యవస్థే లేకుండా పోతే? ఏ ప్రార్థనా స్థలం కనిపిస్తే అక్కడికి వెళతారు. ఆ విధంగా చాలా మంది హిందువులు మతం మారిపోతున్నారు.  చాలా చోట్ల  ఈ గుళ్ళు  అంటే  గ్రామ దేవత వ్యవస్థ అనేది కనుమరుగు అయిపోతోంది.. అన్నీ ఆలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండే ఆలయాలు కావు. ఓ రావి చెట్టు కిందో/ ఊరవతల నో ఉంటాయి.    కొన్ని గుళ్ళు physical గా ఉన్నా పాడుబడిపోయి దీపారాధనకు కూడా నోచుకోవడం లేదు.   ఈ వ్యవస్థ ఇలా దూరం అవ్వడం వల్ల,   ఏదైనా సమస్య వచ్చినవాడికి వారి కుల దైవం అందుబాటులో లేనట్లే. అంతే కదా?  సమస్య వచ్చినపుడే కాదు. ఇంట్లో ఏదైనా శుభకార్యం పెళ్లి , బారసాల లాంటివి  కావచ్చు.  ముందు కులదేవత కి పూజ చేస్తారు. చాగంటి గారు  ఓ ప్రవచనం లో చెప్పారు గ్రామదేవతల విశిష్టత గురించి. ఒక ఊరులో మొదట వచ్చినవారు ఇల్లు కట్టుకునే ముందు  ఊరి  మొదటిలో  ఓ దేవత ని ప్రతిష్టించి  ఆ దేవతకి  పేరు పెట్టె వారు. పోలేరమ్మ అనో, తలుపులమ్మ  అనో అలా . అటువంటి అమ్మ మనకి అండగా ఉంది అన్న నమ్మకం వారిలో కలిగించాలి కదా?

దానధర్మ అనే ఒక సంస్థ తెలుగు రాష్ట్రాలలో  ఈ గ్రామదేవతల గుళ్ళు  పునరుద్ధించడం, ప్రతిష్టించడం అనే కార్యక్రమం చేపట్టారు. Venkat Vutukuri  గారు దానిని స్థాపించారు. వారు అమెరికాలోనే ఉంటారు.  సంస్థ  website లంకె ఇస్తున్నాను.  అన్నీ వివరాలు చూడవచ్చు.   వారు ఈ కార్తీకమాసంలో Pooja kit  లను ఇటువంటి 2500 దేవాలయాల లో అందజేస్తారు.  ఒక్కొక్క kit  లో ఆ నెలకు సరిపడా నూనె, ఒత్తులు, పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తీలు ఉంటాయి. ఒక్కొక్క kit  516/- రూపాయలు  మాత్రమే.   మీ ఎన్ని గుళ్ళకి ఇవ్వగలిగితే అంత ఇవ్వవచ్చు. ఈ గుళ్ళలో భక్తులు ఎంత శ్రద్ధగా చేస్తారో చూస్తే అద్భుతం అనిపిస్తుంది.  మన సంస్కృతిని వదిలివేయకుండా కాపాడుతున్నందుకు ఈ గ్రామాలలో ప్రజలకు  చేతులెత్తి నమస్కరించచ్చు.  ఎన్ని kits  సహాయం చేయగలిగితే అన్ని చేయండి.  అమెరికా వారికీ కేవలం $8. ఎంతమందికి ఈ సందేశం చేరవేయగలితే అంత బావుంటుంది.  ఆ గుళ్ళలో దీపాలు వెలిగించిన వారం  అవుతాము. 

Myindmedia లో Venkat Vutukuri గారి  ప్రసంగాలు విన్నాను. సంస్థ  facebook  పేజీలో ఏమి చేస్తున్నారో చూసాను. వారితో మాట్లాడితే ‘ మీరు విన్నారండీ. అదే సంతోషం. మీరు ఎంత వీలవుతే అంతే  సహాయం చేయండి’ అన్నారు.  ఆశ్చర్యం వేసింది నాకు . కనుమరుగవుతున్న సంస్కృతిని రక్షించుకోవాలన్న తపన వారి మాటలలో వినిపించింది.  

ఇంత కంటే ఏమీ చెప్పలేను.  తరువాత మీ ఇష్టం 🙂 

For USA Friends

https://www.donatekart.com/MB/Support-Daana-Dharma?fbclid=IwAR1cXl0i54Tg-qQHNOmYM5M0FXONSKSnynIP81fgEDJGzYOhEPteL2dh7b8

https://daanadharma.org/